
న్యూఢిల్లీ: ఇండియా బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్కు డాక్టరేట్ లభించింది. బ్యాడ్మింటన్కు చేసిన సేవలకు గుర్తింపుగా కర్నాటకలోని శ్రీ సత్య సాయి యూనివర్సిటీ ఆఫ్ ఎక్స్లెన్స్ గోపీని డాక్టరేట్తో గౌరవించింది. మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఇండియా ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము చేతుల మీదుగా గోపీ పట్టా అందుకున్నారు