సంక్షేమ బోర్డును బీమా కంపెనీలకు అప్పగించొద్దు

సంక్షేమ బోర్డును బీమా కంపెనీలకు అప్పగించొద్దు

ముషీరాబాద్, వెలుగు: భవన నిర్మాణ సంక్షేమ బోర్డును ఇన్సూరెన్స్​కంపెనీలకు అప్పగించొద్దని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు. ప్రమాదవశాత్తు, సహజ మరణ క్లెయిమ్ లను ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పజెప్పాలన్న నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్​చేశారు. తెలంగాణ బిల్డింగ్ అండ్ కన్​స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ(ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో లేబర్ కమిషనర్ కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నా చేపట్టారు. 2009 నుంచి మన రాష్ట్రంలో లేబర్ డిపార్ట్​మెంట్ ద్వారా కార్మికులకు పథకాలు అందుతున్నాయని, ఇప్పుడు ఎలాంటి కారణాలు లేకుండా బీమా రంగానికి అప్పజెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వెంటనే ఈ టెండర్లను రద్దు చేయాలన్నారు.