అధైర్య పడొద్దు.. మళ్లీ అధికారంలోకి వస్తం : కేసీఆర్

అధైర్య పడొద్దు.. మళ్లీ అధికారంలోకి వస్తం : కేసీఆర్
  •  చింతమడక గ్రామస్తులతో కేసీఆర్
  •     9 బస్సుల్లో ఫాంహౌస్​కు వచ్చిన 540 మంది

ములుగు(మర్కుక్)/సిద్దిపేట రూరల్, వెలుగు : సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామంలోని కేసీఆర్​ ఫాంహౌస్​కు బుధవారం ఆయన సొంత గ్రామమైన చింతమడక వాసులు వచ్చారు. 9 బస్సుల్లో 540 మంది గ్రామస్తులు తరలివచ్చారు. అయితే, వారు మధ్యాహ్నం ఒంటి గంటకు రాగా.. అపాయింట్​మెంట్​ లేకపోవడంతో సాయంత్రం నాలుగున్నర గంటల వరకు వారిని చెక్​పోస్ట్ ​దగ్గరే  ఆపేశారు.

చివరకు సాయంత్రం కేసీఆర్ ​పర్మిషన్​ ఇవ్వడంతో ఆయనను కలవడానికి గ్రామస్తులంతా ఫాంహౌస్​లోకి వెళ్లారు. కొద్దిసేపటికి కిందికి వచ్చిన కేసీఆర్​ను చూసిన గ్రామస్తులు ‘కేసీఆర్​సీఎం.. కేసీఆర్​సీఎం’ అంటూ నినాదాలు చేశారు. ‘మేమంతా మీ వెంటే ఉంటాం’ అని గట్టిగా అరిచారు. కేసీఆర్​వారికి అభివాదం చేస్తుండగా గ్రామస్తులంతా కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఒకరిని చూసి మరొకరు కంటతడి పెట్టుకోవడంతో.. కేసీఆర్​తో పాటు అక్కడే ఉన్న మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్​రావు వారిని ఓదార్చారు. ‘‘మళ్లీ మనమే అధికారంలోకి వస్తాం.. ఎవరూ అధైర్యపడొద్దు..” అంటూ ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. పదినిమిషాల పాటు వారితో ఉన్న కేసీఆర్.. ఆ తర్వాత​లోపలికి వెళ్లిపోయారు. తర్వాత గ్రామస్తులంతా 6 గంటలకు తిరుగు ప్రయాణమయ్యారు. 

కేసీఆర్​వైపే చింతమడక ఓటర్లు.. 

అసెంబ్లీ ఎన్నికల్లో చింతమడక ఓటర్లు కేసీఆర్​వైపే నిలిచారు. పోలైన ఓట్లలో బీఆర్ఎస్​కు 1,736 ఓట్లు రాగా, బీజేపీకి 23, బీఎస్పీకి 13, కాంగ్రెస్​ పార్టీకి 11 ఓట్లు వచ్చాయి.