రత్నం మూవీ నుండి డోంట్ వర్రీ డోంట్ వర్రీరా చిచ్చా సాంగ్ విడుదల

రత్నం మూవీ నుండి డోంట్ వర్రీ డోంట్ వర్రీరా చిచ్చా సాంగ్ విడుదల

విశాల్ హీరోగా ‘సింగం’ ఫేమ్ హరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రత్నం’. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. శుక్రవారం  ‘డోంట్ వర్రీ’ అనే పాటను విడుదల చేశారు. దేవిశ్రీ ప్రసాద్‌‌ కంపోజ్ చేయడంతో పాటు తనే పాడాడు.

‘డోంట్ వర్రీ డోంట్ వర్రీరా చిచ్చా.. ఇంతకంటే ఇత్తడయ్యే కష్టాలు చూసి వచ్చా... కిందపడో మీదపడో అన్నీ దాటొచ్చా.. వన్‌‌ వేలో ఎదురెళ్లే ఒంటరి బండిలా.. డిజైన్ డిజైన్‌‌గా డేంజర్‌‌‌‌లు అన్నీ గుద్ది వచ్చా’ అంటూ హీరో క్యారెక్టరైజేషన్‌‌ తెలియజేసేలా శ్రీమణి లిరిక్స్ రాశాడు. స్టోన్‌‌బెంచ్‌‌ ఫిల్మ్స్‌‌, జీ స్టూడియోస్‌‌ సంస్థలు నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 26న విడుదల కానుంది.