తొమ్మిదేళ్లుగా అవినీతి పాలన..దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి

తొమ్మిదేళ్లుగా అవినీతి పాలన..దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి
  • బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి వాసుదేవరెడ్డి

ములుగు, వెలుగు :  రాష్ట్రంలో తొమ్మిదేళ్లుగా అవినీతిపాలన కొనసాగుతోందని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి అన్నారు. యువమోర్చ జిల్లా అధ్యక్షుడు కొత్త సురేందర్​ ఆధ్వర్యంలో   మోదీ ప్రభుత్వ 9ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ములుగులో బైక్​ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వాసుదేవరెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో ప్రతీ వర్గాన్ని  కేసీఆర్​ మోసం చేస్తున్నాడని  విమర్శించారు.  ప్రపంచం ఇబ్బందుల్లో ఉన్నా కూడా ప్రధాని నరేంద్రమోదీ  భారత సంస్కృతీ, సాంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేస్తున్నారని తెలిపారు.  

తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ సిరికొండ బలరాం, జిల్లా కార్యదర్శి ఎస్​.రవీంద్రాచారి, జిల్లా నాయకులు చల్లూరి మహేందర్​, డి.రవిరెడ్డి, బాణాల రాజ్​ కుమార్​, కిసాన్​ మోర్చ అధ్యక్షుడు జినుకల కృష్ణాకర్ రావు, మండల అధ్యక్షుడు ఇమ్మడి రాకేశ్​ యాదవ్​, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డి.రాకేష్​ రెడ్డి  పాల్గొన్నారు.