
హైదరాబాద్, వెలుగు: దోస్త్ రిజిస్ర్టేషన్లు, వెబ్ ఆప్షన్ల ప్రక్రియ గడువును ఈ నెల 25 వరకు పెంచినట్టు దోస్త్ కన్వీనర్ బాలకిష్టారెడ్డి తెలిపారు. డిగ్రీ కాలేజీల ప్రిన్సిపాల్స్, లెక్చరర్లు, స్టూడెంట్ల విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. సెకండ్ ఫేజ్ లో సీట్లు పొందిన విద్యార్థులు ఆన్ లైన్ లో సెల్ఫ్ రిపోర్టు చేసేందుకు ఈ నెల 25 వరకు గడువు పెంచినట్టు పేర్కొన్నారు. ఈ నెల 28న థర్డ్ ఫేజ్ సీట్ల కేటాయింపు చేయనున్నారు. సీట్లు పొందిన విద్యార్థులు జులై1 వరకు ఆన్ లైన్ సెల్ఫ్ రిపోర్టు చేయాలని సూచించారు.