గజ్వేల్ లో చిన్న వానకే కూలిన  డబుల్‌ బెడ్రూమ్‌

గజ్వేల్ లో చిన్న వానకే కూలిన  డబుల్‌ బెడ్రూమ్‌


సిద్దిపేట, వెలుగు: మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ప్రజల కోసం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌‌‌‌‌‌‌‌ సమీపంలోని ముట్రాజ్ పల్లి లో నిర్మించిన డబుల్‌‌‌‌ ‌‌‌‌బెడ్రూమ్​‌‌‌‌ఇంటి గోడ ఆదివారం కూలిపోయింది. చిన్నపాటి వర్షం పడటంతో నేల తడిసి భూమి కుంగి నిర్వాసితుల కాలనీలోని 281 నెంబరు ఇంటి మెట్ల పక్కనే కట్టిన గోడలో పగుళ్లు వచ్చాయి. ఆ తర్వాత గంటల వ్యవధిలోనే గోడ కూలింది. సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం పరిధిలో వేలాదిగా నిర్మించిన డబుల్‌‌‌‌ ‌‌‌‌ఇండ్లలో నాణ్యత లోపాలు బయటపడుతుండటంతో నిర్వాసితులు ఆందోళన చెందుతున్నారు. ముట్రాజ్ పల్లి వద్ద నిర్వాసితుల కోసం దాదాపు 5 వేలకు పైగా డబుల్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌ఇండ్లు కడుతూ ప్రజలను అందులోకి తరలిస్తున్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ప్రాజక్టు నిర్వాసితులకు గొప్ప కాలనీ నిర్మిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. నిర్వాసితులను ముంపు గ్రామాల నుంచి తరలించడానికి పెట్టిన శ్రద్ద వారి కోసం కట్టిన కాలనీపై చూపక పోవడంతో నాణ్యత లోపాలు బయటపడుతున్నాయని పలువురు అంటున్నారు. -