
రామ్ హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పూరి జగన్నాథ్, మణిశర్మ ఇలా హుషారుగా కనిపించారు. మ్యూజిక్ సిట్టింగ్స్ ఫుల్ స్వింగ్లో జరుగుతున్నాయని, ఇప్పటికే కొన్ని టెర్రిఫిక్ ట్రాక్స్ను లాక్ చేశామంటూ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. పూరి, ఛార్మి కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా వైడ్గా మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.