‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న రామ్.. మరోసారి పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ చేస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. వాస్తవానికి ఈ చిత్రాన్ని శివరాత్రి సందర్భంగా మార్చి 8న విడుదల చేయాలనుకున్నారు. కానీ ఆ డేట్ దాటినా టీమ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. తాజాగా కొత్త రిలీజ్ డేట్పై రామ్ క్లారిటీ ఇచ్చాడు.
రీసెంట్గా ఓ ప్రైవేట్ ఈవెంట్లో పాల్గొన్న రామ్.. ‘డబుల్ ఇస్మార్ట్’ జూన్లో విడుదల కానుందని చెప్పాడు. అప్పటికి ఎలక్షన్ హడావుడి అంతా పూర్తవుతుంది కనుక అప్పుడు రావడమే కరెక్ట్ అని మేకర్స్ భావిస్తున్నారట. పూరి, ఛార్మి కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే పాటల పని అంతా పూర్తయినట్టు తెలుస్తోంది. ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోందని, త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్తోపాటు ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట.