
ముషీరాబాద్/పద్మారావునగర్, వెలుగు: గుజరాత్ అహ్మదాబాద్ లో ఎయిరిండియా విమానం ప్రమాద మృతులకు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ లా కాలేజీ సంతాపం ప్రకటించింది. గుజరాత్ హైకోర్టు పిలుపు మేరకు శుక్రవారం బాగ్ లింగంపల్లి లోని లా కాలేజీలో స్టూడెంట్స్, ఫ్యాకల్టీ రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ వై.విష్ణుప్రియ, ప్రిన్సిపాల్ సృజన తదితరులు పాల్గొన్నారు. గాంధీ ఆస్పత్రిలో మెడికోలు క్యాండిల్ ర్యాలీ నిర్వహించి రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళి అర్పించారు.