న్యూఢిల్లీ, వెలుగు: రాజ్యసభ హౌస్ కమిటీ చైర్మన్గా ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. పార్లమెంట్లోని తన చాంబర్లో జరిగిన ఈ కార్యక్రమంలో రాజ్యసభ సెక్రటరీ సోమశేఖర్తో పాటు పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యుల వసతి, ఇతర సౌకర్యాలను లక్ష్మణ్ నేతృత్వంలోని కమిటీ పర్యవేక్షించనుంది.
