మున్సిపల్ ముసాయిదా.. ఓటర్ల జాబితా రిలీజ్ చేయండి : ఆర్డీవో జయచంద్రారెడ్డి

మున్సిపల్ ముసాయిదా.. ఓటర్ల జాబితా రిలీజ్ చేయండి : ఆర్డీవో జయచంద్రారెడ్డి

తూప్రాన్, వెలుగు: మున్సిపల్ ముసాయిదా ఓటర్ల జాబితాను వార్డు వారీగా రూపొందించి గురువారం రిలీజ్​చేయాలని ఆర్డీవో జయచంద్రారెడ్డి ఆదేశించారు. బుధవారం తూప్రాన్ మున్సిపాలిటీకి సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితాను మున్సిపల్​ఆఫీస్​లో కమిషనర్ గణేశ్​రెడ్డితో కలిసి పరిశీలించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని 16 వార్డులకు సంబంధించి 32 పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ స్టేషన్ వారీగా ఓటర్ జాబితాను విడుదల చేయాలని చెప్పారు. ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలన్నింటినీ పరిశీలించి తుది జాబితాను 10న రిలీజ్​చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించినట్లు పేర్కొన్నారు.