ఉమ్మడి వరంగల్ జిల్లాలో మందుల నియంత్రణపై అవగాహన

ఉమ్మడి వరంగల్ జిల్లాలో మందుల నియంత్రణపై అవగాహన

ములుగు/ కాశీబుగ్గ/ భూపాలపల్లి రూరల్/ రేగొండ/ జనగామ​ అర్బన్, వెలుగు: ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం ఉమ్మడి వరంగల్​ జిల్లాలో ఔషధాల దుర్వినియోగం, మత్తు పదార్థాల నివారణపై అవగాహన ర్యాలీలు చేపట్టారు. వరంగల్​ కొత్తవాడలోని కెమిస్ట్​ భవన్​ వద్ద కలెక్టర్​ సత్యశారద ర్యాలీని ప్రారంభించగా, అంతకుముందు సీపీ సన్​ప్రీత్​సింగ్, హనుమకొండ కలెక్టర్​చాహత్​బాజ్​పాయ్​తో కలిసి ఎంజీఎంలో డీఅడిక్షన్​ సెంటర్​ను పరిశీలించారు. ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించి సేవలపై ఆరా తీశారు. అనంతరం నర్సింగ్ స్టాఫ్ కి నిర్వహించిన స్పోర్ట్స్ అండ్ గేమ్ ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్ లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. జయశంకర్​ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కలెక్టర్​ రాహుల్​శర్మతో కలిసి ర్యాలీని ప్రారంభించారు. 

అంతకుముందు ఆయన రేగొండ మండలం గడిపల్లి వేణుగోపాలస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. ములుగులో డ్రగ్​ ఇన్​స్పెక్టర్​ కోమల్ల దేవేందర్​రెడ్డి ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ చేపట్టారు. జనగామలో నిర్వహించిన ర్యాలీని కలెక్టర్​ సందీప్​కుమార్​ ఝా ప్రారంభించారు. అంతకుముందు డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఏఎస్పీ చేతన్​ నితిన్, అడిషనల్​ కలెక్టర్​ బెన్​షాలోమ్​తో కలిసి అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.​​