మేడ్చల్ హైవేపై మందుబాబు హల్చల్

మేడ్చల్ హైవేపై మందుబాబు హల్చల్

మేడ్చల్ హైవే పై మందు బాబు హల్చల్ చేశాడు. మద్యం మత్తు లో‌ ట్రాఫిక్ సిబ్బంది, సీఎం కేసీఆర్, రాష్ట్రప్రభుత్వంపై దుర్భాషలాడాడు. ముకుందా ధియేటర్ వద్ద డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు పోలీసులు. అటువైపు నుంచి వస్తున్న ఓ వ్యక్తి ఫుల్ గా మద్యం తాగి బైక్ ను డ్రైవ్ చేస్తున్నాడు. ట్రాఫిక్ పోలీసులు ఆపి తనిఖీలు నిర్వహించగా..సదరు వ్యక్తి మోతాదుకు మించి మద్యం సేవించినట్టు బ్రీత్ ఎనలైజర్ లో తేలింది.

పోలీసుల చెకింగ్ చేయడంపై అసహనానికి గురైనట్టు భావించి.. అతడు ఇష్టమొచ్చినట్టు దుర్బాషలాడాడు. మందు తాగమని ప్రోత్సహించేది ప్రభుత్వమే తర్వాత తనిఖీలు చేసి చలానాలు వేసేది ప్రభుత్వమే. చివరికి సామాన్యుడే బలౌతున్నాడని వ్యాఖ్యలు చేశాడు. అతడిని వారించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో అతని వాహనాన్ని స్వాధీనం చేసుకొని పబ్లిక్ న్యూసెన్స్ చేస్తున్నాడని మేడ్చల్ పోలీసులకు అప్పగించారు ట్రాఫిక్ పోలీసులు.