- హైదరాబాద్ ఖాజాగూడలోని పబ్ పై టీజీ న్యాబ్ అధికారుల దాడి
- 55 మందికి డ్రగ్ టెస్ట్.. 25 మందికి పాజిటివ్
- వాళ్లందరూ అరెస్టు.. పరారీలో పబ్ ఓనర్లు
- నిందితుల్లో ఐటీ ఎంప్లాయీస్, స్టూడెంట్లు
- గంజాయి, కొకైన్, ఎండీఎం డ్రగ్స్ తీసుకున్నట్టు గుర్తింపు
గచ్చిబౌలి, వెలుగు: హైదరాబాద్ ఖాజాగూడలోని ది కేవ్ పబ్లో డ్రగ్ పార్టీ జరిగింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. శనివారం రాత్రి ఆ పబ్ పై దాడి చేశారు. టీజీ న్యాబ్, సైబరాబాద్ ఎస్వోటీ, ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ అధికారులు, రాయదుర్గం పోలీసులు కలిసి రెయిడ్ చేశారు. పబ్లో ఉన్న 55 మందిని అదుపులోకి తీసుకుని డ్రగ్స్ టెస్ట్ చేయగా, వారిలో 25 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు తేలింది. దీంతో వాళ్లందరినీ అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను మాదాపూర్డీసీపీ వినీత్ ఆదివారం గచ్చిబౌలిలోని తన ఆఫీసులో మీడియాకు వెల్లడించారు.
పార్టీపై ఇన్స్టాలో పోస్టులు..
ఖాజాగూడ మెయిన్ రోడ్డులోని ఓ బిల్డింగ్ నాల్గో అంతస్తులో కేవ్ పబ్ ఉంది. ఇందులో మల్లేపల్లికి చెందిన అబ్దుల్లా అయూబ్(24), నాగారంలోని శిల్పానగర్కు చెందిన శేఖర్కుమార్(52) మేనేజర్లుగా పని చేస్తున్నారు. అబ్దుల్లా డీజే కూడా ఆపరేట్ చేస్తుంటాడు. వీళ్లిద్దరూ కలిసి శనివారం పబ్లో సైకెడెలిక్ పార్టీ పేరుతో ఈవెంట్ ఏర్పాటు చేశారు.
దీని కోసం బెంగుళూర్ కు చెందిన డీజే సందీప్శర్మ(44), హైదరాబాద్లోని దమ్మాయిగూడకు చెందిన డీజే సాయి గౌరాంగ్(26)ను రప్పించారు. ఇది ఎలక్ట్రానిక్ మ్యూజిక్ పార్టీ అని ఇన్ స్టాగ్రామ్ లో పోస్టులు పెట్టారు. ఇన్ స్టాలో పోస్టులు చూసి సిటీలోని వివిధ ప్రాంతాలకు చెందిన కస్టమర్లు శనివారం రాత్రి పబ్కు చేరుకున్నారు. డ్రగ్స్ తీసుకున్నోళ్లే ఈ పార్టీని ఎంజాయ్ చేస్తారని కస్టమర్లకు ఆర్గనైజర్లు చెప్పారు. 25 మందికి డ్రగ్స్ అందజేశారు. వీళ్లందరూ పార్టీకి మూడు, నాలుగు గంటల ముందే పబ్ బయట వివిధ ప్రాంతాల్లో డ్రగ్స్ తీసుకున్నారు.
పరారీలో నలుగురు పబ్ ఓనర్లు..
కేవ్పబ్లో డ్రగ్ పార్టీ జరుగుతున్నదని సమాచారం అందడంతో టీజీ న్యాబ్, సైబరాబాద్ఎస్వోటీ, ఎక్సైజ్ టాస్క్ఫోర్స్, రాయదుర్గం పోలీసులు శనివారం రాత్రి 10.30 గంటల టైమ్లో పబ్పై దాడి చేశారు. పార్టీలో పాల్గొన్న 55 మందిని అదుపులోకి తీసుకుని అందరికీ డ్రగ్స్ టెస్ట్ చేశారు. వీరిలో 25 మందికి పాజిటివ్వచ్చింది. డీజే ఆపరేటర్లు సందీప్శర్మ, సాయి గౌరాంగ్, ఈవెంట్ ఆర్గనైజర్లు అయూబ్, శేఖర్కుమార్ కూడా డ్రగ్స్తీసుకున్నట్టు తేలింది.
17 మంది గంజాయి, ఇద్దరు కొకైన్అండ్గంజాయి, నలుగురు గంజాయి అండ్ఎండీఎం, ఒకరు ఎండీఎంఏ డ్రగ్ తీసుకున్నారు. డీజే ఆపరేటర్ సందీప్శర్మ గంజాయి అండ్ కొకైన్, సాయి గౌరాంగ్ గంజాయి అండ్ఎండీఎం తీసుకున్నారని డీసీపీ తెలిపారు. డ్రగ్స్ తీసుకున్న 25 మందిని అరెస్టు చేశామని చెప్పారు. పబ్ఓనర్లు రాజేశ్, అభినవ్, సాయికృష్ణ, సన్నీ పరారీలో ఉన్నారని పేర్కొన్నారు.
నిందితుల్లో అమెజాన్, టీసీఎస్ ఎంప్లాయీస్..
నిందితుల్లో టీసీఎస్, అమెజాన్వంటి పెద్ద పెద్ద ఐటీ కంపెనీల్లో పని చేసే ఉద్యోగులు, స్టూడెంట్లు ఉన్నారు. అరెస్టయిన విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించామని, వారికి కౌన్సెలింగ్ఇచ్చామని డీసీపీ తెలిపారు. పిల్లలను డీఅడిక్షన్సెంటర్లో జాయిన్చేయాలని సూచించామన్నారు. ఐటీ కంపెనీలకు లెటర్లు రాస్తామని, యాంటీ డ్రగ్ క్యాంపెయిన్స్ నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పబ్ఓనర్లు నలుగురు పరారీలో ఉన్నారని, వాళ్లను అదుపులోకి తీసుకుని విచారించిన తర్వాత పబ్ను క్లోజ్ చేస్తామన్నారు. సమావేశంలో ఎస్వోటీ డీసీపీ శ్రీనివాస్గుప్తా, ఏడీసీపీ జయరాం, మాదాపూర్ఏసీపీ శ్రీకాంత్, టీజీ న్యాబ్డీఎస్పీ శ్రీధర్, ఎక్సైజ్టాస్క్ఫోర్స్డీఎస్పీ శ్రీనివాస్ పాల్గొన్నారు.
