పంజాగుట్ట, వెలుగు : పంజాగుట్టలో డ్రగ్స్దందా చేస్తున్న ముఠాను హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ తో కలిసి పంజాగుట్ట పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. ఒక డ్రగ్ పెడ్లర్తో పాటు నలుగురు సబ్ -పెడ్లర్లను అరెస్ట్చేశారు. వీరి నుంచి 10.5 గ్రాముల ఎండీఎంఏ, 7.5 గ్రాముల హైడ్రోపోనిక్ గంజాయి, 5 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
నిందితుల్లో బీరంగూడకు చెందిన డ్రైవర్కటంగూర్ మహన్ రెడ్డి, ఐటీ ఎంప్లాయ్స్రూపానీ ముఖేష్ బాబు, బన్ని, సన్నీ, అమెజాన్ఉద్యోగి మొహమ్మద్ అబ్దుల్ నబీ అర్షాద్, ఐటీ స్టూడెంట్శ్రీరామ్ రవితేజ ఉన్నారు. మరికొందరు పరారీలో ఉండగా పోలీసులు గాలిస్తున్నారు. కేసులో నిందితులను పట్టుకున్న సీఐ రామకృష్ణ, ఎస్ఐ జి.నరేశ్ను ఏసీపీ మురళీకృష్ణ అభినందించారు.
