గ్రైండర్ యాప్‌‌ ద్వారా డ్రగ్స్‌‌ విక్రయం ..ఇద్దరు విక్రేతలు, ఏడుగురు వినియోగదారులు అరెస్ట్‌‌

గ్రైండర్ యాప్‌‌ ద్వారా డ్రగ్స్‌‌ విక్రయం ..ఇద్దరు విక్రేతలు, ఏడుగురు వినియోగదారులు అరెస్ట్‌‌
  • 100 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం

పద్మారావునగర్, వెలుగు: గ్రైండర్(గే డేటింగ్​యాప్) ద్వారా డ్రగ్స్​విక్రయిస్తున్న ఇద్దరిని, వినియోగిస్తున్న ఏడుగురిని ఈస్ట్ జోన్‌‌ టాస్క్ ఫోర్స్‌‌, చిలకలగూడ పోలీసులు అరెస్ట్​చేశారు. ఈస్ట్ జోన్​ డీసీపీ బాలస్వామి తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూల్​కు చెందిన ఎం.రమాకాంత్‌‌ అలియాస్​కిరణ్‌‌, అచ్చంపేటకు చెందిన ముడావత్​ప్రసాద్​ఉపాధి నిమిత్తం నగరానికి వచ్చారు. రమాకాంత్​ఓ ప్రైవేట్​కంపనీలో ఆఫీస్​అసిస్టెంట్​గా, ప్రసాద్​వాక్యూమ్​టెక్నీషియన్​గా చేసేవారు. వీరు 2024లో డ్రగ్స్​కేసులో అరెస్టయ్యారు. 

బెయిల్‌‌పై బయటకు వచ్చిన తర్వాత కూడా డ్రగ్స్​విక్రయిస్తున్నారు. బెంగళూరులో ఓ నైజీరియా పౌరుడి నుంచి గ్రాము ఎండీఎంఏను రూ.4 వేలకు కొనుగోలు చేసి, గ్రైండర్ యాప్‌‌ ద్వారా హైదరాబాద్‌‌లో రూ.10‌‌‌‌ వేలకు అమ్ముతున్నారు. పక్కా సమాచారంతో పోలీసులు గురువారం చిలకలగూడ సీతాఫల్​మండిలోని ఓ అపార్ట్ మెంట్​లో తనిఖీలు చేపట్టి ఈ ఇద్దరితోపాటు మరో ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు రమాకాంత్, ప్రసాద్, వినయ్​కుమార్, డాక్టర్​అతిఫ్​అబ్దుల్​సమీ(సర్జన్), కోతపల్లి మోషా, కేతావత్​రాజు నాయక్, షేక్​సమీర్, సత్య సురేశ్​బాబు, వంశీకృష్ణ అందరూ హోమో సెక్స్​చేసేవాళ్లేనని తేలిందని డీసీపీ పేర్కొన్నారు. 

రాకెట్, పావురం, ఏరోప్లేన్​వంటి సింబల్స్ ను డ్రగ్స్​రవాణాలో వాడుతున్నారని చెప్పారు. వీరిలో ఐదుగురికి గతంలో పెళ్లిళ్లు జరిగి, విడాకులైనట్లు తెలిపారు. నిందితుల వద్ద నుంచి 100 గ్రాముల ఎండీఎంఏ, 10 మొబైల్‌‌ ఫోన్లు, ఒక చిన్న వేయింగ్ మెషీన్‌‌ స్వాధీనం చేసుకొని వారిని అరెస్ట్​చేసినట్లు పేర్కొన్నారు. టాస్క్‌‌ఫోర్స్‌‌ అడిషనల్​డీసీపీ శ్రీనివాస్‌‌రావు, ఈస్ట్‌‌ జోన్‌‌ అడిషనల్​డీసీపీ నర్సయ్య, ఏసీపీ శశాంక్‌‌రెడ్డి తదితరులున్నారు.