- 15 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం
గచ్చిబౌలి: బెంగళూరు నుంచి నగరానికి ఎండీఎంఏ డ్రగ్ తెచ్చి అమ్ముతున్న ముగ్గురిని మాదాపూర్ ఎస్ఓటీ, చందానగర్ పోలీసులు పట్టుకున్నారు. మాదాపూర్ జోన్ డీసీపీ రితిరాజ్ వివరాలను వెల్లడించారు. శేరిలింగంపల్లి బాపునగర్కు చెందిన డి.హరీశ్(28), సాయికృష్ణ, సాయి మణికంఠ బెంగళూరులో డ్రగ్స్ కొనుక్కొని హైదరాబాద్లో అమ్మేందుకు ప్రయత్నించారు.
ఈ నెల 23న ఆలిండ్ ఫ్యాక్టరీ సమీపంలోని ఓ పాన్ షాప్ వద్ద ఎండీఎంఏను విక్రయిస్తున్నట్లు తెలియడంతో మాదాపూర్ జోన్ ఎస్ఓటీ, చందానగర్ పోలీసులు కలిసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. రూ. లక్షా 80 వేల విలువైన 15 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు.
నార్సింగిలో హెరాయిన్..
గండిపేట: నార్సింగి మై హోమ్ అవతార్ లేబర్ క్యాంపు వద్ద హెరాయిన్ విక్రయిస్తుండగా ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. బెస్ట్ బెంగాల్ నుంచి తీసుకువచ్చినట్లు గుర్తించారు. ఆ రాష్ట్రానికి చెందిన దాల్మియా, లక్కన్ బర్మాను అరెస్టు చేశారు.
గచ్చిబౌలిలో గంజాయి స్వాధీనం..
గచ్చిబౌలి, వెలుగు: హైదరాబాద్లో కూలీలను టార్గెట్ చేస్తూ గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం గచ్చిబౌలిలోని మాదాపూర్ జోన్ డీసీపీ అఫీస్లో ఎస్ఓటీ డీసీపీ శోభన్తో కలిసి మాదాపూర్ డీసీపీ రితిరాజ్ వివరాలను వెల్లడించారు. వెస్ట్ బెంగాల్కు చెందిన మితున్ బర్మాన్(36) పటాన్చెరులోని ఇస్నాపూర్లో, సుడెన్ రాయ్(25) కోకాపేటలో, రెజౌల్ షేక్(30) లింగంపల్లిలోని లేబర్ క్యాంప్లో ఉంటూ కూలీలుగా పనిచేస్తున్నారు.
వీరు తమ రాష్ట్రంలో గంజాయి కొనుగోలు చేసి హైదరాబాద్లోని తెల్లాపూర్ ప్రాంతంలో కూలీలకు అమ్మాలని ప్లాన్ చేశారు. ముగ్గురు కలిసి వెస్ట్ బెంగాల్ నుంచి ట్రైన్లో సికింద్రాబాద్కు వచ్చారు. ఆటోల్లో తెల్లాపూర్ ప్రాంతానికి వెళ్లగా, సమాచారం అందుకున్న మాదాపూర్ జోన్ ఎస్ఓటీ, కొల్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద 41.9 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
శామీర్పేట పరిధిలో..
శామీర్ పేట: భద్రాచలం జిల్లా చింతూరు నుంచి హైదరాబాద్ కు గంజాయి తరలిస్తున్న ఐదుగురిని మేడ్చల్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. శామీర్ పేట ఓఆర్ఆర్ పై అదుపులోకి తీసుకుని నాలుగు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
