తాగిన మత్తులో యువతి హల్చల్చేసిన ఘటన బెంగళూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని స్ట్రీట్ వీధిలో ఉన్న పబ్బులో యువతి ఫుల్గా మద్యం తాగింది. అనంతరం బయటకి వచ్చి స్థానికులతో గొడవ పడటం ప్రారంభించింది.
వారి కంప్లెంట్తో రంగంలోకి దిగిన పోలీసులు ఆమెను వారించి అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులపై ఆమె దుర్భాషలాడింది. అదుపులోకి తీసుకోవడానికి ఓ మహిళ సహాయం తీసుకోగా యువతి మహిళను సైతం పక్కకు నెట్టి.. ఆటోలో ఎక్కడానికి నిరాకరించింది.
యువతి తన కారును రాంగ్పార్కింగ్చేసిందని.. ఇదే విషయంలో ట్రాఫిక్ పోలీసులకు ఆమెకు వాగ్వాదం నడిచిందని స్థానికులు చెబుతున్నారు. అనంతరం మరో మహిళ సాయంతో ఆమెను ఆటో ఎక్కించి ఇంటికి చేరవేశారు. ఆమె వివరాలు, కేసు నమోదైందా లేదా అనే విషయాలు ఇంకా తెలియరాలేదు. మద్యం మత్తులో పోలీసులపై అసభ్యకరంగా ప్రవర్తించినందుకు చర్యలు తీసుకునే అవకాశం ఉంది.