మూడు రైళ్లు పై నుంచి వెళ్లినా బతికాడు

మూడు రైళ్లు పై నుంచి వెళ్లినా బతికాడు

మూడు రైళ్లు పై నుంచి వెళ్లినా ఓ వ్యక్తి మృత్యుంజయుడిగా బయటపట్టాడు. రైళ్లు వెళ్లడం చూసిన వాళ్లంతా ఈ ఘోరం చూడలేము అనుకున్నారు. ఊహించిన దానికి వ్యతిరేకం కావడంతో అంతా ఇది కలా,నిజమా అనుకున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది.

అయితే రైలు పట్టాలపై ఓ వ్యక్తి మృతదేహం పడివుందని లోకోమోటివ్‌ పైలట్‌ పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు అక్కడికి చేరుకునే సరికి ఆ మార్గంలో మూడు రైళ్లు వెళ్లాయి. దీంతో అతని మృతదేహం గుర్తు పట్టరానంతగా ఉంటుందని అనుకున్నారు. బాడీని తరలిచేందుకు పట్టాల దగ్గరకు చేరుకున్నారు. ఇంతలో చనిపోయాడనుకున్న ఆ వ్యక్తి లేచి కూర్చున్నాడు. ముందు ఆశ్చర్య పోయిన పోలీసులు.. తర్వాత ఆ వ్యక్తిని ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించి  ఆ తర్వాత అతన్ని ఇంటికి పంపించేశారు.

అశోక్‌నగర్‌ కు చెందిన ధర్మేంద్ర అని వ్యక్తి ఫుల్ గా మందు కొట్టి రైలు పట్టాల మధ్యలోనే పడుకున్నాడు. ఎంతగా అంటే అతనిపై నుంచి రైళ్లు వెళ్లినా తెలియనంతగా నిద్రపోయాడు.