పోలీస్ స్టేషన్‌లో మాజీ సర్పంచ్ కొడుకు వీరంగం.. ఫర్నిచర్ ధ్వంసం

పోలీస్ స్టేషన్‌లో మాజీ సర్పంచ్ కొడుకు వీరంగం.. ఫర్నిచర్  ధ్వంసం

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి పోలీస్ స్టేషన్‌లో మాజీ సర్పంచ్ కొడుకు రాజీవ్ నాయుడు వీరంగం సృష్టించాడు. ఎడపల్లి గ్రామానికి చెందిన కటకం శంకర్ అనే వ్యక్తి పై దాడి ఘటనలో రాజీవ్ ను పోలీస్ స్టేషన్ కు పిలిపించారు ఎస్సై ఎల్లాగౌడ్. తాగిన మైకంలో ఉన్న రాజీవ్ ఒంటి మీద స్పృహ లేకుండా ప్రవర్తించాడు. పోలీస్ స్టేషన్‌లో నానా హంగామా సృష్టించాడు. పోలీసులను బెదిరిస్తూ ఎస్సై నేమ్ ప్లేట్, ఫర్నిచర్ నేలకేసి పగలగొట్టాడు. అంతటితో ఆగకుండా ఎస్సై టేబుల్‌కు తల పగలగొట్టుకున్నాడు. దీంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి బోధన్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

drunked Former Sarpanch's son halchal in police station, furniture destroyed