
- టీఎస్ఐఐసీ ఎండీ విష్ణువర్ధన్
హైదరాబాద్, వెలుగు : తీర ప్రాంతం లేని తెలంగాణ రాష్ట్రంలో త్వరలో డ్రైపోర్ట్ఏర్పాటు కానుందని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు మౌలిక సదుపాయాల కార్పొరేషన్ (టీఎస్ఐఐసీ) ఎండీ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. దీనికి అవసరమైన భూమిని సేకరించామని, భవిష్యత్తులో రాబోయే రెండు నుంచి మూడు అదనపు డ్రై పోర్ట్ల నిర్మాణం కోసం కూడా పని చేస్తున్నామని ఆయన వెల్లడించారు. హైదరాబాద్లో ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్టీసీసీఐ) నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ
‘‘త్వరలో మనరాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ టౌన్షిప్ కూడా ఏర్పాటు కాబోతోంది. హైదరాబాద్కు ఔటర్ రింగ్ రోడ్డు వల్ల భారీ ప్రయోజనం ఉంది. రీజనల్ రింగ్ రోడ్తోనూ ఎన్నో లాభాలు ఉంటాయి. ఇది 340 కిలోమీటర్ల మేర ఏర్పాటవుతుంది. లాజిస్టిక్స్లో ఎంఎస్ఎంఈలు కీలక పాత్ర పోషిస్తాయి” అని వివరించారు.