రైతులకు టార్పాలిన్లు అందించాలి : డీఎస్ ​చౌహాన్

రైతులకు టార్పాలిన్లు అందించాలి : డీఎస్ ​చౌహాన్

యాదాద్రి, వెలుగు: రైతులకు వెంటనే టార్పాలిన్లు అందించాలని రాష్ట్ర సివిల్​సప్లయ్​కమిషనర్​ డీఎస్​చౌహాన్ అధికారులను ఆదేశించారు. బుధవారం రాత్రి భువనగిరి మండలం నందనం ఐకేపీ సెంటర్​ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు, ట్రాన్స్​పోర్ట్​ వివరాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న పలువురు రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

 తమకు టార్పాలిన్లు అందడం లేదని పలువురు రైతులు రాష్ట్ర ​చౌహాన్​ దృష్టికి తీసుకెళ్లారు. అకాల వర్షాలతో వడ్లు తడుస్తాయన్న భయం కలుగుతోందని వారు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతుల నుంచి ప్రతి గింజ కొనుగోలు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట అడిషనల్​కలెక్టర్​ బెన్​షాలోమ్, సివిల్​సప్లయ్​ డీఎం గోపీకృష్ణ, డీసీఎస్​వో శ్రీనివాస్​రెడ్డి, డీఏవో అనురాధ ఉన్నారు.