టైమొచ్చినప్పుడు గట్టిగా మాట్లాడతా : డీఎస్

టైమొచ్చినప్పుడు గట్టిగా మాట్లాడతా : డీఎస్

ఇటీవల ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలవడంపై నిజామాబాద్ లో స్పందించారు రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్. దేశానికి హోం మంత్రిగా ఉన్నాడనే అమిత్ షాను కలిశానని చెప్పారు. భారతీయ జనతా పార్టీ ఆఫీస్ లో అమిత్ షాను కలవలేదని అన్నారు. తాను కాంగ్రెస్ ను వీడటమే ఆశ్చర్యం కలిగించే విషయం అన్నారు. తప్పు చేశానని తనపై టీఆర్ఎస్ లీడర్లు ఆరోపణలు చేశారనీ… నిజంగా తప్పుచేస్తే టీఆర్ఎస్ యాక్షన్ తీసుకోవడానికి ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారాయన. తన కొడుకు అరవింద్ బీజేపీ నుంచి ఎంపీగా గెలిచాడనీ… ఆయన సిద్ధాంతాలు ఆయనకు ఉంటాయని అన్నారు. వాటితో సంబంధం లేదని అన్నారు. తెలంగాణపై భారతీయ జనతాపార్టీ ఫోకస్ చేసిందని అన్నారు. జిల్లా అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి తాను చేయాల్సింది చేశానని చెప్పారు.

తాను చాలా తక్కువగా మాట్లాడతానని చెప్పారు డీఎస్. అనవసరంగా దేనిపైనా స్పందించనననీ.. ఏదైనా స్పందించాల్సి వస్తే గట్టిగానే స్పందిస్తా అని బదులిచ్చారు డీఎస్.