సంక్రాంతి తర్వాత నిరుద్యోగులకు గుడ్ న్యూస్..

సంక్రాంతి తర్వాత నిరుద్యోగులకు గుడ్ న్యూస్..

అమరావతి: నిరుద్యోగులకు జగన్ సర్కార్ గుడ్‌ న్యూస్ చెప్పింది.  చాలా రోజులుగా ఉపాధ్యాయ పోస్టుల కోసం ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగుల కోసం డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. 

సంక్రాంతి తర్వాత మెగా డీఎస్సీ వేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే సీఎం జగన్ డీఎస్సీపై సమీక్ష నిర్వహించారుని.. ఈ సందర్భంగా వీలైనంత త్వరగా డీఎస్సీ నోటీఫికేషన్ ను విడుదల చేయాలని అధికారులను ఆదేశించారని ఆయన చెప్పారు. త్వరలోనే ఉద్యోగాల భర్తీపై విధివిధానాలను ప్రకటిస్తామని మంత్రి బొత్స చెప్పారు.