డీఎస్సీ పోస్టులు పెంచాలి : సిటీ లైబ్రరీలో నిరుద్యోగుల ధర్నా

డీఎస్సీ పోస్టులు పెంచాలి : సిటీ లైబ్రరీలో నిరుద్యోగుల ధర్నా

ముషీరాబాద్, వెలుగు: అసెంబ్లీలో సీఎం ప్రకటించినట్లుగా 13  వేల డీఎస్సీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయాలని, నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్వహించే పరీక్షలను అయిదు నెలల పాటు వాయిదా వేయాలని చిక్కడపల్లి సిటీ లైబ్రరీలో గురువారం నిరుద్యోగులు ధర్నాకు దిగారు.  ఈ  సందర్భంగా నిరుద్యోగుల సంఘం నాయకుడు లక్ష్మణ్ మాట్లాడుతూ..  గతంలో సీఎం కేసీఆర్ 13 వేల పోస్టులు భర్తీ చేస్తామని అసెంబ్లీలో ప్రకటించారని అయిదు వేల డీఎస్సీ పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారని మండిపడ్డారు. 

నవంబర్ 21, 22 తేదీలతో పాటు వారం రోజుల పాటు పరీక్షలు జరుగుతాయని అదే నెలలో రెండో తేదీన గ్రూపు 2 పరీక్ష కూడా ఉందన్నారు.  మరో ముఖ్య పరీక్ష గ్రూపు 2 ఉండగా.. అదే నెలలో డీఎస్సీ పరీక్షలు నిర్వహించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. నిరసన కార్యక్రమంలో నిరుద్యోగులు సురేశ్, సలీం, పరశురాములు, మహేశ్, విఠల్, గిరి, ప్రవళిక తదితరులు పాల్గొన్నారు.