- 188.80 గ్రాముల ఆభరణాలు స్వాధీనం
సికింద్రాబాద్,వెలుగు: లోక్ సభ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎలాంటి ఆధారాలు లేకుండా బంగారు ఆభరణాలు తరలిస్తున్న వ్యక్తిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద రూ.13.16లక్షల విలువైన 188.80 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్ రైల్వే అర్బన్డీఎస్పీ ఎన్. జావెద్శుక్రవారం మీడియాకు వివరాలు తెలిపారు. సికింద్రాబాద్రైల్వే ఇన్స్పెక్టర్సాయి ఈశ్వర్గౌడ్సిబ్బందితో ఉదయం 6.30గంటలకు రైల్వేస్టేషన్లో తనిఖీలు చేస్తున్నారు.
ప్లాట్ఫామ్ -4 వద్ద ఓ వ్యక్తి బ్యాగుతో అనుమానాస్పదంగా తిరుగుతుండగా.. అతని బ్యాగును చెక్ చేశారు. అందులో 188.80గ్రాముల బంగారు ఆభరణాలు లభించాయి. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా చార్మినార్కాళీ కమాన్ ప్రాంతానికి చెందిన మనబ్హుదాయత్(34)గా తెలిపాడు. నగలు గుంటూరుకు తీసుకెళ్తున్నానని జన్మభూమి ఎక్స్ప్రెస్ కోసం ఎదురుచూస్తున్నట్టు అతడు వెల్లడించాడు. నగలకు రసీదులు, ఇతర ఆధారాలు చూపకపోవడంతో స్వాధీనం చేసుకుని ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు అప్పడించినట్టు డీఎస్పీ జావెద్తెలిపారు. అదేవిధంగా రైల్వే పోలీసులు గత మార్చి 16 నుంచి మే 24 వరకు చేపట్టిన తనిఖీల్లో రూ.1. 44 కోట్ల విలువైన ఆభరణాలు, నగదు పట్టుకున్నారు.