నాగార్జున సాగర్ ఉప ఎన్నిక నుంచే కేసీఆర్ పతనం ప్రారంభం

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక నుంచే కేసీఆర్ పతనం ప్రారంభం

నల్గొండ: కేసీఆర్ పతనం నాగార్జున సాగర్ ఉప ఎన్నిక నుంచే ఆరంభం కావాలని పిలుపునిచ్చారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. నల్గొండ జిల్లా హాలియాలో బీజేపీ తలపెట్టిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం సభలో మాట్లాడుతూ… టీఆర్ఎస్ పాలనలో దళితులు, గిరిజనులు ధ‌గాకు గురయ్యారని ఆరోపించారు. కుర్చీ వేసుకుని నల్గొండ జిల్లాను అభివృద్ధి చేస్తానన్న కేసీఆర్ కు కుర్చీ దొరకడం లేదా అంటూ ఎద్దేవా చేశారు. నల్గొండ జిల్లాలో ఇంత వరకూ ఫ్లోరోసిస్ నిర్మూలన కాలేదనీ…ఇంటికో ఉద్యోగమూ రాలేదని విమర్శించారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఫలితాలే సాగర్ లోనూ రిపీట్ అవుతాయని రఘునందన్ జోస్యం చెప్పారు.