దుల్కర్ సల్మాన్ హీరోగా అభిలాష్ జోషి తెరకెక్కించిన చిత్రం ‘కింగ్ ఆఫ్ కోత’. జీ స్టూడియోస్తో కలిసి దుల్కర్కు చెందిన వేఫేరర్ ఫిల్మ్స్ సంస్థ నిర్మించింది. ఆగస్టు 24న పాన్ ఇండియా వైడ్గా సినిమా విడుదల కానుంది. రీసెంట్గా హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన హీరో నాని మాట్లాడుతూ ‘దుల్కర్ చేస్తున్న చిత్రాలని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది.
నాకు తెలిసిన పాన్ ఇండియా యాక్టర్ ఎవరైనా ఉన్నారా అంటే అది దుల్కర్ మాత్రమే. హిందీ, తెలుగు, తమిళ్, మలయాళ దర్శకులు దుల్కర్ కోసం కథ రాసుకుంటారు. పాన్ ఇండియా యాక్టర్ అనే మాటకు ఇది నిజమైన నిర్వచనమని భావిస్తున్నాను. ‘కింగ్ ఆఫ్ కోత’ చాలా ప్రామెసింగ్ గా కనిపిస్తోంది .
ట్రైలర్ , విజువల్స్, మ్యూజిక్.. చాలా ఎనర్జిటిక్ గా ఉన్నాయి. ‘సీతారామం’తో దుల్కర్ అందరి మనసులు గెలుచుకున్నాడు. ఈ సినిమాతో అది నెక్స్ట్ లెవల్కి వెళ్లాలని కోరుకుంటున్నా’ అన్నాడు. మరో గెస్ట్ రానా మాట్లాడుతూ ‘మా యాక్టింగ్ స్కూల్లో దుల్కర్ నా జూనియర్. అక్కడి నుంచి తను పరిచయం. చాలా పద్దతైన వ్యక్తి. మృదు స్వభావి. అలాంటిది దుల్కర్ యాక్షన్ సినిమా చేయడం చాలా ఎక్సయిటింగ్గా ఉంది’ అన్నాడు.
దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ ‘ఇది మా అందరి డ్రీమ్ ప్రాజెక్ట్. నా కెరీర్లో బిగ్గెస్ట్ ఫిల్మ్. బలంగా నమ్మి చేసిన గ్యాంగ్స్టర్ డ్రామా. మీరంతా ఈ చిత్రాన్ని మెచ్చుకొని పెద్ద హిట్ కాదు బ్లాక్ బస్టర్ చేస్తారని ఆశిస్తున్నా’ అని అన్నాడు. హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి, నిర్మాతలు స్రవంతి రవి కిషోర్, నిమ్మకాయల ప్రసాద్తో పాటు మూవీ టీమ్ అంతా పాల్గొన్నారు.