మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాలు చేస్తున్నాడు. వాటిలో రవి నేలకుదిటి దర్శకత్వం వహిస్తున్న మూవీ ఒకటి. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దుల్కర్ హీరోగా నటిస్తున్న 41 చిత్రమిది. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది.
తాజాగా ఈ మూవీ షూటింగ్కు సంబంధించిన కీలక షెడ్యూల్ పూర్తయింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసిన టీమ్.. మంచుతో కప్పుకున్న అద్భుతమైన ప్రకృతి మధ్య కీలక షెడ్యూల్ను కంప్లీట్ చేశామని తెలియజేశారు.
ఈ సందర్భంగా సెట్స్ నుంచి విడుదలైన ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి. వింటర్ అవుట్ ఫిట్స్లో దుల్కర్, పూజా హెగ్డే తమ అందమైన ప్రెజెన్స్తో ప్రత్యేకంగా కనిపించారు. ఇక నెక్స్ట్ షెడ్యూల్ను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. అలాగే ఈ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ కూడా కొన్ని రోజుల్లో ఉండబోతుందని హింట్ ఇచ్చారు.
లవ్ స్టొరీతో పాటు అద్భుతమైన హ్యుమన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో సీనియర్ నటి రమ్యకృష్ణ, జగపతిబాబు, దీక్షిత్ శెట్టి ముఖ్య పాత్రలు పోషిస్తున్నట్టు తెలుస్తోంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.
