మలయాళ నటుడే అయినా ‘మహానటి’ చిత్రంతో తెలుగులోనూ మంచి గుర్తింపును అందుకున్నాడు దుల్కర్ సల్మాన్. ఆ తర్వాత ‘సీతారామం’ వంటి బ్లాక్ బస్టర్ హిట్తో ఇక్కడి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. తాజాగా మరో తెలుగు డైరెక్టర్తో సినిమా చేస్తున్నాడు.
వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘లక్కీ భాస్కర్’ అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు దుల్కర్. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆదివారం హైదరాబాద్లో పూజా కార్యక్రమాలతో ఈ మూవీ షూటింగ్ను మొదలుపెట్టారు.
ఈ కార్యక్రమంలో టీమ్ అంతా పాల్గొని సినిమాపై కాన్ఫిడెంట్గా ఉన్నామన్నారు. ‘నమ్మలేని విధంగా ఉన్నత శిఖరాలకు చేరిన ఒక సాధారణ మనిషి కథ’ ఇదని దర్శకుడు వెంకీ అట్లూరి చెప్పాడు. డిఫరెంట్ స్టోరీ లైన్తో హై బడ్జెట్తో ఈ సినిమా ఉండబోతోందని అన్నారు నిర్మాతలు. మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్గా నవీన్ నూలి, జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.