కూకట్పల్లి, వెలుగు: కేపీహెచ్బీ కాలనీ రెండో ఫేజ్లోని ధనలక్ష్మి సెంటర్ వద్ద బుధవారం డ్వాక్రా మహిళా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. దాదాపు పదేండ్లుగా మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న టైలరింగ్ శిక్షణా కేంద్రాన్ని తొలగించి ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్కు కేటాయించేందుకు జీహెచ్ఎంసీ అధికారులు చేస్తున్న ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
