గ్లోబల్ సమ్మిట్ తెలంగాణ భవిష్యత్ కు సంబంధించిన సమ్మిట్ అని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రాష్ట్రానికి కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సమ్మిట్ ఉపయోగపడుతుందన్నారు.డిసెంబర్ 8 మధ్యాహ్నం ఒంటిగంటకు గ్లోబల్ సమ్మిట్ ను గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రారంభిస్తారని చెప్పారు. తొలి రోజు ముఖ్యమంత్రి, మంత్రుల ప్రసంగాలు ఉంటాయని చెప్పారు భట్టి. మొత్తం 27 సెషన్లు ఉంటాయన్నారు. తెలంగాణ విజన్ డాక్యుమెంటరీ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తామని చెప్పారు.
డిసెంబర్ 8న మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3 గంటల వరకు ప్రసంగాలు ఉంటాయన్నారు భట్టి. మధ్యాహ్నం 2.30గంటలకు రేవంత్ ప్రసంగిస్తారని చెప్పారు . మధ్యాహ్నం 3 గంటల నుంచి పలు రంగాలపై చర్చ జరుగుతుందని.. 3 గంటల నుంచి 4 గంటల వరకు విద్యుత్ రంగంపై చర్చ ఉంటుందని తెలిపారు. సెమీకండక్టర్లు, గ్రీన్ ఎర్జీ , ఎరోస్పేస్ ఎడ్యుకేషన్ పై చర్చ జరుగుతుందన్నారు. సాయంత్రం 6గంటలకు సమ్మిట్ ముగుస్తుందన్నారు
డిసెంబర్ 9వ తేదీ ఉదయం 10 గంటలకు సమ్మిట్ మళ్లీ ప్రారంభం అవుతుందని చెప్పారు భట్టి. సాయంత్రం 6 గంటలకు ముగుస్తుందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కోరుకునే వారు ఈ సమ్మిట్ లో పాల్గొనవచ్చని చెప్పారు. ఇండిగో సమస్య ఉండటంతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ముఖ్యమైన వాళ్లు రావడానికి ఇబ్బంది ఉంటే వాళ్లకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేస్తామని తెలిపారు భట్టి.
