2019 EAMCET పరీక్ష: 2 గంటల ముందే సెంటర్స్ కు…

2019 EAMCET పరీక్ష: 2 గంటల ముందే సెంటర్స్ కు…

2019 ఎంసెట్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు అధికారులు. పరీక్ష సమయానికి 2 గంటల ముందే సెంటర్స్ కు చేరుకోవాలని సూచించారు. మే 3, 4, 6 తేదీల్లో ఇంజనీరింగ్ విభాగానికి ఆన్ లైన్ పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. అగ్రికల్చర్, ఫార్మా స్ట్రీమ్ విద్యార్థులకు 8,9 తేదీల్లో పరీక్ష జరగనుంది.  మధ్యాహ్నం 3గంటల నుంచి 6 గంటల పరీక్షలు నిర్వహిస్తారు. ఎప్పటిలాగానే నిమిషం నిబంధనను పక్కాగా అమలు చేస్తామంటున్నారు ఎంసెట్ కన్వీనర్ యాదయ్య.