దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం సంభవించింది. అక్టోబర్ 15 ఆదివారం సాయంత్రం 4 గంటలకు భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో భూకంపం సంభవించింది.
భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.1గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. ఈ భూకంప కేంద్రం హర్యానాలోని ఫరీదాబాద్కు 13 కిలో మీటర్లు దూరంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొంది.
Earthquake of Magnitude:3.1, Occurred on 15-10-2023, 16:08:16 IST, Lat: 28.41 & Long: 77.41, Depth: 10 Km ,Location: 9km E of Faridabad, Haryana, India for more information Download the BhooKamp App https://t.co/bTcjyWm0IA @KirenRijiju @Dr_Mishra1966 @moesgoi @Ravi_MoES pic.twitter.com/gG5B4j3oBs
— National Center for Seismology (@NCS_Earthquake) October 15, 2023
భూకంపం ధాటికి ఇండ్లలో కొన్ని వస్తువులు కదలడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ భూప్రకంపనలకు సంబంధించిన దృశ్యాలను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.