జమ్మూ కశ్మీర్లో భూకంపం ప్రకంపనులు సృష్టించింది. దోడా జిల్లాలో 4.9 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. 2023 జూలై 10సోమవారం ఉదయం 5 గంటల38 నిమిషాలకు భూకంపం సంభవించింది.
అయితే ఎలాంటి నష్టం జరగ లేదని అధికారులు తెలిపారు. గత నెల జూలైలోనూ దోడా జిల్లాలో పలుమార్లు భూకంపం సంభవించింది. ఓ వైపు భారీ వర్షాలతో కల్లోలంగా ఉన్న జమ్మూ కశ్మీర్లో భూకంపం రావడం అలజడి రేపుతోంది.
జూన్ 13న జిల్లావ్యాప్తంగా 5.4 తీవ్రతతో భూకంపం సంభవించడంతో ఇళ్లు సహా డజన్ల కొద్దీ భవనాలు బీటలు వారాయి.