
పాకిస్తాన్ లో ఉగ్రవాదం అంతం చేసేందుకు ప్రజలు ముందుకు రావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పాక్ యువకులు, మేధావులు ఉగ్రవాదం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని అన్నారు. టెర్రరిజంపై ప్రభుత్వాన్ని నిలదీయాలని.. అంతం చేసేందుకు నడుం బిగించాలని సూచించారు. గుజరాత్ లోని భుజ్ ప్రాంతంలో ర్యాలీ నిర్వహించిన మోదీ.. పాకిస్తాన్ కు పలు కీలక హెచ్చరికలు జారీ చేశారు.
‘‘టెర్రరిజం అంతం చేయడానికి ప్రజలు ముందుకు రావాలి. రోటీ తిని ప్రశాంతంగా ఉండాలి లేదంటే మా బుల్లెట్ రెడీగా ఉంది’’ అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మోదీ. టెర్రిరిజం అంటే టూరిజంలా పాక్ భావిస్తుందని మోదీ అన్నారు. ఇది ప్రపంచ శాంతికి మంచిది కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత టెర్రరిస్టులపై పాక్ యాక్షన్ తీసుకుంటుందని 15 రోజులు వేచిచూశానని మోదీ తెలిపారు. కానీ పాకిస్తాన్ కు ఉగ్రవాదం బ్రెడ్ అండ్ బటర్ లా మారిందని స్పష్టమైందని అన్నారు.
ఆపరేషన్ సిందూర్.. మానవత్వాన్ని కాపాడేందుకు.. ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకేనని ఈ సందర్భంగా ప్రధాని మోదీ చెప్పారు. పాక్ హుషారు చేస్తే భారత్ రియాక్షన్ ఎలా ఉంటుందో రుచి చూపించామని.. భారత ఆర్మీ దెబ్బకు పాక్ ఆర్మీ బేస్ లు ఇంకా ఐసీయూలోనే ఉన్నాయని అన్నారు.
మా లక్ష్యం టెర్రరిస్టుల స్థావరాలను ధ్వంసం చేయడమేనని ముందే చెప్పామని.. సైలెంట్ గా ఉండమని చెప్పి టెర్రర్ క్యాంపులను నాశనం చేశామని.. కానీ పాక్ ఉగ్రవాదులకు అండగా తమపైకి వచ్చిందని అన్నారు. అందుకే వాళ్ల ఆర్మీ బేస్ లను ధ్వంసం చేసినట్లు చెప్పారు ప్రధాని మోదీ.
#WATCH | Bhuj, Gujarat: "... sukh chain ki zindagi jiyo, roti khao, warna meri goli to hai hi...," says PM Narendra Modi.
— ANI (@ANI) May 26, 2025
He further says, "The people of Pakistan need to come forward to get their country rid of terrorism. Their youth will have to come forward...'" pic.twitter.com/v84WxNjTGP