జనసేన ఎన్నికల గుర్తు గాజు గ్లాసు: ఈసీ స్పష్టీకరణ

జనసేన ఎన్నికల గుర్తు గాజు గ్లాసు: ఈసీ స్పష్టీకరణ

2024 లోక్ సభ ఎన్నికలకు జనసేన పార్టీకి కేంద్రం ఎన్నికల సంఘం గాజు గ్లాసు గుర్తును ఖరారు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను ఈ-మెయిల్ ద్వారా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులు గాజు గ్లాసు గుర్తును కేటాయించాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది. 

గత సార్వత్రిక ఎన్నికలు, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గాజు గ్లాసు గుర్తుపైనే జనసేన అభ్యర్థులు పోటీ చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా ఈసారి ఎన్నికల్లో కూడా గాజు గ్లాస్ గుర్తుపైనే అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలవనున్నారని జనసేన తెలిపింది. ఈసీ ఉత్తర్వు కాపీలను జనసేన లీగల్ సెల్ ఛైర్మన్ సాంబశివ ప్రతాప్  పవన్ కల్యాణ్ కు అందజేశారు. ఈసీ నిర్ణయంపై పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం అధికారులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు