కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై ఈసీ సీరియస్

కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై ఈసీ సీరియస్
  •      విచారణ జరిపి రిపోర్ట్ పంపాలని ఆదేశం

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జిన్నా రాజ్యాంగం వస్తుందన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కామెంట్లపై ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయింది. దీనిపై విచారణ చేసి రిపోర్ట్ పంపాలని రంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారిని ఈసీ ఆదేశించింది. కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఏఐసీసీ సభ్యుడు జి.నిరంజన్ ఎన్నికల కమిషన్​కు కంప్లైంట్ చేశారు. ఇది ఎన్నికల ఉల్లంఘన కిందికి వస్తుందని పేర్కొన్నారు. 

ప్రజలను రెచ్చగొట్టేలా కిషన్ రెడ్డి మాట్లాడారని తెలిపారు. ఈ నెల 8న రంగారెడ్డి జిల్లా మొయినాబాద్​లో నిర్వహించిన చేవెళ్ల లోక్​సభ నియోజకవర్గ బూత్ స్థాయి అధ్యక్షుల సమ్మేళనంలో ఈ వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని కోరారు.