పోలింగ్ రోజు ఉద్యోగులకు హాలిడే ఇవ్వాలి

పోలింగ్ రోజు ఉద్యోగులకు హాలిడే ఇవ్వాలి
  •     ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీలకు ఈసీ ఆదేశం

హైదరాబాద్, వెలుగు :  రాష్ట్రంలో ఎంపీ ఎన్నికల పోలింగ్ రోజు( మే13న)న అన్ని సంస్థల ఉద్యోగులకు పెయిడ్ హాలిడే ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. షెడ్యూల్ విడుదల చేసే టైమ్ లో కేంద్ర ఎన్నికల సంఘం ఇందుకు గైడ్ లైన్స్ ఇచ్చిందని బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. తెలంగాణలో ఇతర రాష్ర్టాలకు (కర్నాటక, మహారాష్ర్ట, చత్తీస్ గఢ్ ) చెందిన ఓటర్లు

ఉంటే ఆయా రాష్ర్టాల్లో పోలింగ్ ఉన్న రోజుల్లో ఓటు వేసేందుకు వెళ్లేలా పెయిడ్ హాలిడే ఇవ్వాలని స్పష్టం చేసింది. కౌంటింగ్ సెంటర్లు ఉన్న దగ్గర కూడా హాలిడే ఇవ్వాలని పేర్కొంది. తమ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఈసీ హెచ్చరించింది. దీనిపై కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేయాలని సూచించింది.