ఇంకొన్ని వారాలు టైమ్ ఇవ్వండి

ఇంకొన్ని వారాలు టైమ్ ఇవ్వండి
  • ఇంకొన్ని వారాలు టైమ్ ఇవ్వండి
  • ఈడీకి సోనియా లెటర్ 


న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణకు హాజరయ్యేందుకు తనకు ఇంకొన్ని వారాలు టైమ్ ఇవ్వాలని ఈడీని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ కోరారు. ఈ మేరకు ఆమె బుధవారం ఈడీకి లెటర్ రాసినట్లు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరామ్ రమేశ్ వెల్లడించారు. ‘‘సోనియా కరోనా, ఊపిరితిత్తుల సమస్యతో ఆస్పత్రిలో చేరారు. ఇటీవల డిశ్చార్జి అయిన ఆమెకు ఇంటి దగ్గరే రెస్టు తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. పూర్తిగా కోలుకునేదాకా విచారణ వాయిదా వేయాలని ఈడీని సోనియా కోరారు” అని ఆయన పేర్కొన్నారు. కాగా, సోనియాకు ఈడీ మొదట ఈ నెల 8న హాజరు కావాలని సమన్లు ఇచ్చింది. ఆమెకు కరోనా రావడంతో ఈ నెల 23న రావాలని మరోసారి సమన్లు పంపింది.