కేజ్రీవాల్కు 8వ సారి ఈడీ నోటీసులు

కేజ్రీవాల్కు 8వ సారి ఈడీ నోటీసులు

లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. మార్చి 4న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. కేజ్రీవాల్ కు ఈడీ నోటీసులు జారీ చేయడం ఇది ఎనిమిదోసారి. తనకు ఈడీ నోటీసులివ్వడం చట్టవిరుద్ధమన్న కేజ్రీవాల్ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా  విచారణకు హాజరుకావడం లేదు. తాను వేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో ఉందని ఈడీ,సీబీఐ విచారణకు హాజరుకావడ లేదు.ఈడీ విచారణకు హాజరైతే కేజ్రీవాల్ ను అరెస్ట్ చేస్తారని ఆప్ ఆరోపిస్తుంది. మరి ఏనిమిదోసారి నోటీసులపై  ఆప్ ఇంకా స్పందించలేదు.

కేజ్రీవాల్ కు 8 సార్లు ఈడీ నోటీసులు

మొదటి సారి  నవంబర్ 2, 2023 
రెండోసారి డిసెంబర్ 21,  2024
మూడోసారి జనవరి 3 
నాల్గో సారి జనవరి 13 
ఐదవ సారి జనవరి 31 
ఆరో సారి ఫిబ్రవరి 14
ఏడో సారి ఫిబ్రవరి 22 
ఎనిమిదో సారి ఫిబ్రవరి 27