12 గంటలుగా పూరి, ఛార్మీని విచారిస్తున్న ఈడీ

12 గంటలుగా పూరి, ఛార్మీని విచారిస్తున్న ఈడీ

లైగర్ మూవీకి సంబంధించిన లావాదేవీలపై  డైరెక్టర్ పూరి జగన్నాథ్, నటి ఛార్మిని  ఈడీ అధికారులు విచారిస్తున్నారు.  ఉదయం ముంబై నుంచి హైదరాబాద్ కు వచ్చిన వీరిద్దరూ ఈడీ ఎదుట హాజరయ్యారు. దాదాపు 12 గంటలుగా పూరి, ఛార్మీని ఈడీ ప్రశ్నిస్తోంది. 15 రోజుల క్రితమే పూరి జగన్నాథ్, ఛార్మిలకు ఈడీ నోటీసులు పంపింది. ఈ నేపథ్యంలో ఇవాళ విచారణకు హాజరైన వీరిద్దరిపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. లైగర్ పెట్టుబడుల వెనుక ఎవరున్నారనే దానిపై ఆరా తీస్తున్నారు. 

లైగర్ సినిమా నిర్మాణంలో రాష్ట్రానికి చెందిన ఓ మహిళా నేత సంస్థ నుంచి డబ్బులు వచ్చినట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా నిర్మాణానికి సంబంధించిన లావాదేవీల గురించి తెలుసుకోవడంపై ఈడీ అధికారులు దృష్టిపెట్టారు.