30 గంటలుగా కొనసాగుతున్న ఈడీ సోదాలు

30 గంటలుగా కొనసాగుతున్న ఈడీ సోదాలు

రైల్వే కాంట్రాక్టర్ ఇజాజ్ ఫారూక్ నివాసంలో ED సోదాలు కొనసాగుతున్నాయి. దాదాపు 30 గంటలుగా ఈ దాడులు జరుగాయి. K అండ్ R రైల్వే ఇంజనీరింగ్ కంపెనీ నుండి 100 కోట్ల దాకా నకిలీ బిల్లులు తయారు చేసినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. కొద్దీ రోజుల క్రితమే కాంట్రాక్టర్ ఇజాజ్ పై సీబీఐ దాడులు చేసి కేసు నమోదు చేసింది. అయితే సీబీఐ కేసు ఆధారంగా ఈడీ రంగం లోకి దిగింది. తార్నాక లోని స్టీట్ నెంబర్ 6లో ఉన్న ఇజాజ్ ఫారూక్ నివాసంలో దాడులు కొనసాగుతున్నాయి.

ఈ క్రమంలో తార్నాకలో ఇజాజ్ ఫరూక్ అనుచరులు హులచల్ చేశారు. మీడియా ప్రతినిధుల పై ఇజాజ్ అనుచరులు దాడి దిగారు. ఈడి సోదాలు కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులను ఇజాజ్ అనుచరులు కొట్టారు. ఈ సోదాల్లో ఇప్పటి వరకు భారీగా నగదు, డాక్యుమెంట్ లు స్వాధీనం చేసుకునారు అధికారులు.