జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఇదివరకే మనీలాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్కు ఈడీ పలుమార్లు సమాన్లు జారీ చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ కింద స్టేట్మెంట్ రికార్డింగ్ ఇంకా పూర్తికాలేదని మరోసారి ప్రశ్నించాల్సి ఉందని ఈడీ నోటీసులో తెలిపింది.
ఈ క్రమంలోనే జనవరి 27 నుంచి 31లోగా జోనల్ ఆఫీస్కు రావాలని తెలిపింది. జనవరి 20 నాడు ఈడీ సీఎం అధికారిక నివాసంలో విచారణ చేసిన సంగతి తెలిసిందే. 7 గంటల పాటు ఈడీ ఆయనను ప్రశ్నించింది. జార్ఖండ్లో మనిలాండరింగ్ కు పాల్పడ్డారని ఈడీ ఇప్పటి వరకు 14 మందిని అరెస్టు చేసింది.
ED questioning of Jharkhand CM Hemant Soren is over. The questioning did not complete today. ED is likely to interrogate him one more day. The day will be decided later. ED teams will leave CM's residence soon: Sources https://t.co/EBYvbFHy1N
— ANI (@ANI) January 20, 2024