బంగారు తెలంగాణ అబద్ధపు ప్రచారం : కె.శ్రీనివాస్

బంగారు తెలంగాణ అబద్ధపు ప్రచారం : కె.శ్రీనివాస్

ఓయూ,వెలుగు :  తెలంగాణ లక్ష్యాలు, ఆశయాల సాధనకు కృషి చేయాలని ప్రముఖ పత్రికా సంపాదకుడు కె.శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ‘బంగారు తెలంగాణ’ అనేది అబద్ధపు ప్రచారమేనన్నారు. ఓయూ సోషియాలజీ డిపార్ట్​మెంట్​లో కొనసాగుతున్న  జాతీయ సదస్సులో మంగళవారం ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ పునర్నిర్మాణం అంటే భవనాలు కూల్చి కట్టడం కాదన్నారు.

 కాంగ్రెస్ ప్రభుత్వం దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగాలని సూచించారు. పరిశ్రమల్లో  స్థానికులకే ఉద్యోగాలు దక్కాల్సిన అవసరం ఉందన్నారు. ప్రొ.నీలరాములు చైర్మన్​గా వ్యవహరించగా, ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ చింతా గణేశ్​,  సోషియాలజీ బీఓఎస్ చైర్మన్ ప్రొఫెసర్ పి. విష్ణు దేవ్,  జాతీయ సదస్సు కో డైరెక్టర్ డాక్టర్ బీనవేని రామ్ షెఫర్డ్  తదితరులు పాల్గొన్నారు.