
పాపన్నపేట, వెలుగు: ఏడుపాయల వనదుర్గామాత ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జనంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. ఉదయం నుంచే భక్తులు మంజీర పాయల్లో పుణ్యస్నానాలు చేసి దుర్గమ్మ దర్శనం కోసం మండపంలో బారులు తీరారు.
అనంతరం అమ్మవారికి ఒడిబియ్యం పోసి, బోనాలు సమర్పించి మెక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా పాలక మండలి చైర్మన్ బాలాగౌడ్, ఆలయ ఈవో మోహన్రెడ్డి ఏర్పాట్లు చేశారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్ఐ నరేశ్ బందోబస్తు చేపట్టారు.