అమ్మను, తమ్ముడిని ఇంట్లోంచి గెంటేసిండు

 అమ్మను, తమ్ముడిని ఇంట్లోంచి గెంటేసిండు
  • పక్షవాతంతో ఉన్న కొడుకును ఎటుతీసుకుపోవాలంటూ పోలీసులను ఆశ్రయించిన తల్లి
  • వికారాబాద్ జిల్లాలో దారుణం

పరిగి, వెలుగు:12 ఎకరాల కుటుంబ ఆస్తిని గుప్పిట్లో పెట్టుకొని.. షోషణ భారమైందని చెబుతూ కన్నతల్లిని, పక్షవాతంతో బాధపడుతున్న తమ్ముడిని ఓ అన్న ఇంట్లో నుంచి గెంటేశాడు. పక్షవాతంతో ఉన్న కొడుకును తీసుకొని ఎటుపోవాలంటూ ఎనభై ఏండ్ల  బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్ జిల్లా పరిగి మండలం నస్కల్ గ్రామానికి చెందిన రాపోల్ సత్యమ్మ (80)కు ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు ఉండగా, అందరికీ పెండ్లిళ్లు చేసింది. చిన్న కొడుకు మహిపాల్ భార్య నాలుగేళ్ల కింద చనిపోగా.. అతను పక్షవాతంతో బాధపడుతూ తల్లితోనే ఉంటున్నాడు. అప్పటి నుంచి కుటుంబానికి చెందిన దాదాపు 12 ఎకరాల్లో గోవర్ధన్ రెడ్డి ఒక్కడే  వ్యవసాయం చేసుకుంటున్నాడు. 

ఈ క్రమంలోనే కన్నతల్లిని, తమ్ముడిని షోషించడం భారంగా ఉందని, వీరిద్దరిని సోమవారం ఇంట్లో నుంచి గెంటేశాడు. బాధితులు చేసేదేమీ లేక పరిగి పీఎస్​లో ఫిర్యాదు చేశారు. దీంతో గోవర్ధన్ రెడ్డికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి సత్యమ్మ, మైపాల్ రెడ్డిని ఇంటికి పంపించారు. మళ్లీ ఇలాంటి  ఘటన పునరావృతమైతే కేసు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించినట్టు సమాచారం.