మంచి లీడర్​షిప్​తోనే జనాలకు మేలు : తలసాని శ్రీనివాస్ యాదవ్

మంచి లీడర్​షిప్​తోనే జనాలకు మేలు : తలసాని శ్రీనివాస్ యాదవ్
  • సనత్ నగర్ సెగ్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్

పద్మారావునగర్, వెలుగు : మంచి లీడర్​షిప్​తోనేజనాలకు మేలు జరగుతుందని సనత్ నగర్ సెగ్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బుధవారం అమీర్ పేట డివిజన్ హనుమాన్ టెంపుల్, కుమ్మరి బస్తీ, సిక్ వాడ, హరిజన బస్తీల్లో ఇంటింటికి తిరుగుతూ ఆయన ఎన్నికల  ప్రచారం నిర్వహించారు. ముందుగా హనుమాన్ ఆలయం వద్ద పూజారులు ఆయనకు వేదమంత్రాలతో ఆశీర్వచనం చేశారు. ప్రచారంలో జనం అడగడుగనా ఘన స్వాగతం పలికారు. మహిళలు మంగళ హరతులు పట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

సిక్ వాడలో ప్రచారానికి వెళ్లే ముందు భగత్ సింగ్ విగ్రహానికి తలసాని శ్రీనివాస్ పూలమాల వేసి నివాళులర్పించారు. తమ సంపూర్ణ మద్దతును తలసాని శ్రీనివాస్​కు ప్రకటిస్తూ ఆ ఏరియాలోని సిక్కులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. తొమ్మిదిన్నరేండ్లలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం కేసీఆర్ పనితీరుకు నిదర్శనమన్నారు. ఎన్నికల సమయంలో కల్లబొల్లి మాటలు చెప్పే కాంగ్రెస్, బీజేపీని జనం నమ్మే పరిస్థితిలో లేరన్నారు. భారీ మెజార్టీతో మరోసారి తనను గెలిపించాలని కోరారు.

ఆయన వెంట మాజీ కార్పొరేటర్ నామన శేషు కుమారి, డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు హన్మంతరావు, నాయకులు సంతోష్​, ప్రవీణ్​ రెడ్డి తదితరులు ఉన్నారు. బన్సీలాల్ పేట డివిజన్​లోని బండమైసమ్మ నగర్, మెట్లబావి, మసీదు గల్లీ, ట్రస్ట్ ఆఫీసు, ఏ, బీ, సీ క్లాస్, చాచా నెహ్రూ ఏరియాల్లో తలసాని శ్రీనివాస్ పాదయాత్ర నిర్వహించారు. సికింద్రాబాద్ ఎంపీ సెగ్మెంట్ బీఆర్ఎస్ ఇన్ చార్జి తలసాని సాయికిరణ్​ యాదవ్, కార్పొరేటర్ హేమలత  పాల్గొన్నారు.