ఒడిశా, రాజస్థాన్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రలలో జరగనున్న ఉప ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది. డిసెంబర్ 5వ తేదీన పోలింగ్, 8వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. ఈసీ నోటిఫికేషన్ ప్రకారం డిసెంబర్ 8వ తేదీన గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. నవంబర్ 10 నుండి 17వ తేదీ వరకు అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేయవచ్చు. నవంబర్ 18న నామినేషన్ల పరిశీలన, నవంబర్ 21న అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అని ఈసీ వెల్లడించింది.
ఒడిశాలోని పదంపూర్, రాజస్థాన్లోని సర్దార్షహర్, బీహార్లోని కుర్హానీ, ఛత్తీస్గఢ్లోని భానుప్రతాపూర్, ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఉత్తరప్రదేశ్లోని మెయిన్పురి పార్లమెంట్ స్థానానికి కూడా డిసెంబర్ 5వ తేదీనే పోలింగ్ జరగనుంది. ఇప్పటికే హిమాచల్, గుజరాత్ రాష్ట్రాలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది.